
ఫ్రెండ్షిప్ డే.. ఒక్కచోటికి చేరిన బాల్య మిత్రులు
సాక్షి, నెట్వర్క్: ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు.
ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
జిల్లాలో పలుచోట్ల ఆత్మీయ సమ్మేళనాలు
నిర్వహించిన పూర్వవిద్యార్థులు
ఆత్మీయ పలకరింపులతో
భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు

ఫ్రెండ్షిప్ డే.. ఒక్కచోటికి చేరిన బాల్య మిత్రులు

ఫ్రెండ్షిప్ డే.. ఒక్కచోటికి చేరిన బాల్య మిత్రులు