ఇందిర ఆత్మీయ భరోసా కోసం ఆందోళనలు | - | Sakshi
Sakshi News home page

ఇందిర ఆత్మీయ భరోసా కోసం ఆందోళనలు

Aug 3 2025 9:04 AM | Updated on Aug 3 2025 9:04 AM

ఇందిర ఆత్మీయ భరోసా కోసం ఆందోళనలు

ఇందిర ఆత్మీయ భరోసా కోసం ఆందోళనలు

సిరికొండ: ఇందిర ఆత్మీయ భరోసా అమలుకు కోసం ఈ నెల 20 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిషన్‌, రమేశ్‌ తెలిపారు. మండలంలోని గడ్కోల్‌లో శనివారం సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 5న కలెక్టరేట్‌, 20న జీపీలు, 21 నుంచి 30 వరకు తహసీల్‌ కార్యాలయాలు, సెప్టెంబర్‌ 10న చలో సెక్రటేరియట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. బాల్‌రెడ్డి, సాయారెడ్డి, అశోక్‌, దయాల్‌సింగ్‌, ఎర్రన్న, కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement