లయన్స్‌ యాంటీ డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ చైర్మన్‌గా విజయానంద్‌ | - | Sakshi
Sakshi News home page

లయన్స్‌ యాంటీ డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ చైర్మన్‌గా విజయానంద్‌

Jun 16 2025 7:07 AM | Updated on Jun 16 2025 7:07 AM

లయన్స్‌ యాంటీ డ్రగ్స్‌  అవేర్‌నెస్‌ చైర్మన్‌గా విజయానంద

లయన్స్‌ యాంటీ డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ చైర్మన్‌గా విజయానంద

నిజామాబాద్‌నాగారం: లయన్స్‌ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ 320ఈ ప్రిలిమినరీ క్యాబినెట్‌ సమావేశం ఆదివారం హైదదార్‌లో జరిగింది. గవర్నర్‌ లయన్‌ అమర్నాథ్‌ రావు 2025– 26 సంవత్సరానికి యాంటీ డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాల జిల్లా చైర్మన్‌ గా జిల్కార్‌ విజయానంద్‌ను నియమించారు. ప్రస్తు తం జోన్‌ చైర్మన్‌గా ఉన్న లయన్స్‌ క్లబ్‌ ఇందూర్‌కు పూర్వాద్యక్షులుగా విజయానంద్‌ వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లా వైస్‌ గవర్నర్‌ నరసింహరాజు, జిల్లా కోశాధికారి మర్రి ప్రవీణ్‌, జిల్లా కేబినెట్‌ అధికారులు దీకొండ యాదగిరి, లక్ష్మీనారాయణ, కరిపే రవీందర్‌, రమేష్‌ కులకర్ణి పాల్గొన్నారు.

శ్రీశ్రీ కి ఘన నివాళులు

నిజామాబాద్‌ రూరల్‌: తెలుగు సాహిత్యానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ఘనత శ్రీ శ్రీకి దక్కిందని డీసీఈబీ కార్యదర్శి బి. సీతయ్య అన్నారు. ఆదివారం మహాకవి శ్రీశ్రీ 42వ వర్ధంతిని నాందేవ్‌వాడలోని పెన్షనర్స్‌ భవన్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీశ్రీ రాసిన రచనలు కొనియాడారు. శ్రీశ్రీ చిత్రపటానికి కవులు, గాయకులు నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement