
మూలకు చేరిన బగ్గీ వాహనం
నిజామాబాద్ సిటీ: ప్రజల సొమ్ముతో రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన వాహనం మూలనపడింది. ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు నగరంలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షించడానికి బ్యాటరీతో నడిచే బగ్గీ వాహనాన్ని కొనుగోలు చేశారు. రెండేళ్ల క్రితం అప్పటి అర్బన్ ఎమ్మెల్యే, ఇతర అధికారులతో ఈ వాహనం నగరంలో చక్కర్లు కొట్టింది. లక్షల రూపాయలు ఖర్చుచేసి ఆర్భాటంగా కొనుగోలు చేసిన బగ్గీ వాహనం ప్రస్తుతం బల్దియాలోని పార్కింగ్ స్థలంలో వృథాగా పడి ఉంది. అధికారులు స్పందించి వాహనాన్ని వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
రూ. లక్షల ప్రజాధనం వృథా