
క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం
నిజామాబాద్నాగారం : నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–19 క్రికెట్ లీగ్ టోర్నమెంట్ను శనివారం అర్సపల్లిలో శైలేజా మైదానంలో ప్రారంభమయ్యాయి. కోచ్ నయూమ్, ఫారస్లు టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. మొదటి మ్యాచులో గ్రీన్ వర్సెస్ ఏల్లో మధ్య జరిగింది. టాస్ గెలిచి గ్రీన్జట్టు బ్యాటింగ్ చేయగా 10 వికెట్లకు గాను 255 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఏల్లో జట్టు 150 పరుగులకే అలౌట్కావడంతో గ్రీన్ జట్టు గెలిచింది. రెండో మ్యాచ్లో బ్లాక్ వర్సెస్ బ్లూ బ్లాక్ మధ్య పోటీ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన బ్లూ బ్లాక్జట్టు నిర్ణీత ఓవర్లలో 130 పరుగులు చేసి అలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బ్లాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 105 పరుగులు చేసి అలౌట్కావడంతో బ్లూ బ్లాక్జట్టు గెలిచింది.
ఆలయాల పరిరక్షణ
మన బాధ్యత
నిజామాబాద్ రూరల్: ఆలయాలను పరిరక్షించుకోడం మన బాధ్యత అని జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శనివారం నగరంలోని కబ్జాకు గురువుతున్న బోధన్ రోడ్లోని ఆటోనగర్ హనుమాన్ మందిరాన్ని రక్షించటానికి సహకరించాలని శ్రీ హనుమాన్ మందిర పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఇందల్వాయి కిషన్ గంట్యాల వెంకటేశ్, అంబదాస్ రావు, మల్లేశ్ గౌడ్, దోర్నాల రవి, శాతాల లింబాద్రి, మధు తదితరులు అర్బన్ బీజేపీ క్యాంపు ఆఫీసులో అర్వింద్ కు వినతి పత్రం అందించారు.
గౌడ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు
నిజామాబాద్ అర్బన్ : గౌడ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గౌడ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్ గౌడ్ ప్రకటనలో తెలిపారు. 2024– 25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ఆదివారం న్యూ అంబేడ్కర్ భవన్లో ఉదయం 10 గంటలకు ఈ పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్త సమ్మెను
విజయవంతం చేయాలి
నిజామాబాద్ సిటీ : కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, వాటిని రద్దుచేసేవరకు కార్మికులు ఐక్యపోరాటాలకు సిద్ధంకావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని నాందేవ్వాడలోని పార్టీకార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రమ మాట్లాడారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిలువరించేందుకు, ప్రాథమిక హక్కులను రక్షించుకొనేందుకు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు చేయబోయే సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని కోరారు. జులై 9న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు రమేష్ బాబు, శంకర్ గౌడ్, నూర్జహాన్, గంగాధర్, నన్నేసావ్, శ్రీనివాస్, రాజ్, విజయ, మోహన్, గణేష్ , రమేష్, గంగాధర్, మహేష్ , జాదవ్, మురళి, రాములు, షేక్ అబ్దుల్, విమలమ్మ పాల్గొన్నారు.
వాల్పోస్టర్ల ఆవిష్కరణ
వేల్పూర్ : వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలోని పీకేటీపీ బీడీ సెంటర్లో టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభల వాల్పోస్టర్లను నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఈనెల 19న సిరికొండ మండల కేంద్రంలో జరిగే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మహాసభ , 21,22 తేదీలలో నిజామాబాద్లో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి జి.అరవింద్, నాయకులు గంగాధర్, లింబాద్రి, అన్వర్, పద్మ, హేమలత, సాయన్న, రాజేందర్, ఆనంద్, కావేరి తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం

క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం

క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం