ప్రశ్నే ప్రగతికి మెట్టు | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నే ప్రగతికి మెట్టు

Jun 15 2025 9:12 AM | Updated on Jun 15 2025 9:12 AM

ప్రశ్నే ప్రగతికి మెట్టు

ప్రశ్నే ప్రగతికి మెట్టు

నిజామాబాద్‌నాగారం:. ప్రశ్నించడమే ప్రగతికి మెట్టని, రాజ్యాంగ చట్టాలపై అందరికీ అవగాహన అవసరమని వక్తలు పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని పెన్షనర్స్‌ అసోసియేషన్‌ హాల్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కోయేడి నర్సింహులు అధ్యక్షత వహించగా, రాష్ట్ర అధ్యక్షుడు నర్రా రామారావు హాజరై మాట్లాడారు. జనవిజ్ఞాన వేదిక 1988 ఫిబ్రవరి 28 జాతీ య సైన్స్‌ దినోత్సవం రోజు ఆవిర్భవించిందని తెలిపారు. ఆవిర్భావం కంటే ముందు సమాజ మార్పు కోరే ఉద్యోగస్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు కలిసి భారత జన విజ్ఞాన జాత ద్వారా గ్రామాన్ని తెలుసుకో గ్రామాన్ని మార్చుకో అనే అంశంపై కళాజాత నిర్వహించారని గుర్తు చేశారు. అనంతరం మన విశ్వం అనే అంశంపై సురేశ్‌ కావాల్లా ప్రసంగించారు. రాజ్యాంగ ఆవశ్యకత, హక్కులు, చట్టాలు తదితర అంశాలపై సాయన్న అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి గంగాకిషన్‌, వెంకట మల్లయ్య, విజయ ఆనంద రావు, రామకృష్ణ, పెద్ది వెంకట్రాములు, జేవీవీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

● చట్టాలపై అవగాహన అవసరం

● జన విజ్ఞాన వేదిక ప్రత్యేక తరగతుల్లో వక్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement