
భూభారతిని సమర్థవంతంగా అమలు చేయాలి
నిజామాబాద్ అర్బన్: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం జిల్లాలో సమర్థవంతంగా అమలయ్యేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. శనివారం ఆయన నిజామాబాద్ ఆర్డీవో, సౌత్, నార్త్ తహసీల్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూ భారతి రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలన్నారు. తప్పిదాలకు ఆస్కారం లేకుండా, భూ భారతి చట్టంలోని నిబంధనలను తుచ తప్పకుండా పాటిస్తూ, పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డుల వివరాలతో సరిపోల్చుకుని, క్షేత్రస్థాయి విచారణను పకడ్బందీగా జరపాలని అన్నారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, సౌత్, నార్త్ తహసీల్దార్లు బాలరాజు, విజయ్కాంత్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
రైతు వేదికలను ముస్తాబు చేయాలి
ఈ నెల 16న నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లాలోని అన్ని రైతు వేదికలను అందంగా ముస్తాబు చేయాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించా రు. డిచ్పల్లి మండలం నడిపల్లి, మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలను సందర్శించి, అందు బాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రై తు నేస్తం కార్యక్రమానికి ఆదర్శ రైతులతోపాటు స్థా నిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. సీఎం వీసీ ద్వారా రైతులతో ముఖాముఖి జరుపనున్నందున ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసా య అధికారి వీర స్వామి తదితరులు ఉన్నారు.
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
ఆర్డీవో, తహసీల్ కార్యాలయాల తనిఖీ
మోపాల్, నడిపల్లి రైతు వేదికలు పరిశీలన