
జిల్లాలో పనిచేయడం గొప్ప అనుభూతి
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లాలో విఽ దులు నిర్వహించడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని బదిలీ అయిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన టి వినయ్ కృష్ణారెడ్డికి ఇదే వేదికపై స్వాగత కార్యక్ర మం ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ కలెక్టర్గా తాను జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కింది స్థాయి ఉద్యోగి మొ దలుకుని ప్రతి శాఖకు చెందిన అధికారులందరూ అన్ని విషయాల్లోనూ ఎంతగానో సహకరించారని అన్నారు. వారి తోడ్పాటు కారణంగానే జిల్లాను ధాన్యం సేకరణ వంటి అనేక అంశాలలో ముందంజలో నిలుపగలిగామని, వరుసగా వచ్చిన శాసన సభ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల ను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడంలో సఫలీకతం కాగలిగామని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయాధారిత ప్రాంతమైన జిల్లా లో పని చేయడం వల్ల ధాన్యం సేకరణ, పసుపు, ఎర్రజొన్న వంటి అంశాలతో పాటు, సాగు రంగంపై మంచి అనుభవం ఏర్పడిందని, మునుముందు నిర్వర్తించే విధులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. జిల్లా ప్రజలు ఎంతో మంచివారని, అన్ని వర్గాల వారు అందించిన సహకారంతోనే జిల్లాను ప్రగతి దిశలో ముందంజలో నిలుపగలిగామన్నారు. జిల్లా పాలనాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ టి వినయ్ కష్ణారెడ్డితో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. జిల్లాకు సమర్థవంతమైన అధికారి కలెక్టర్గా వచ్చారని, ఆయన నేతృత్వంలో జిల్లా మరింతగా ప్రగతి దిశగా పయనిస్తుందనే పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తిస్తూ అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, తనకు తోడ్పాటును అందించిన రీతిలోనే నూతన కలెక్టర్ కు కూడా పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందించాలని కోరారు.
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్ తదితరులు బదిలీపై వెళ్తున్న రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి పని చేసిన అనుభవాలను నెమరువేసుకున్నారు.
వీడ్కోలు సమావేశంలో అన్ని శాఖలకు చెంది న జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు సుమన్, పీఆర్టీయూ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి వి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధికి కలిసి పనిచేద్దాం : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ బదిలీ పై వెళ్తున్న రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కలెక్టర్ గా తనదైన ప్రత్యేకతను చాటారని, ఆయన ఒరవడిలోనే ముందుకు సాగుతూ జిల్లాను అన్ని రంగాలలో ముందంజలో నిలిపేలా కషి చేస్తానని అన్నారు. తాను ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతానని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాల లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేద్దామన్నారు.
ఉద్యోగులు, అధికారుల సహకారం వల్లే ధాన్యం సేకరణ, ఇతర అంశాలలో జిల్లా ముందంజ
శాసన సభ, పార్లమెంటు, ఎమ్మెల్సీ
ఎన్నికలు సమర్థవంతంగా
నిర్వహించగలిగాం
వీడ్కోలు సమావేశంలో పూర్వ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు