
రాష్ట్రంలోనే ఏకైక పట్టు చేనేత సహకారం సంఘం
మీకు తెలుసా?
తెలంగాణ ఉన్న ఏకైక పట్టు చేనేత సహకార సంఘం ఆర్మూర్ పట్టణంలో కొనసాగుతోంది. గోల్బంగ్లా వద్ద ఉన్న పట్టు చేనేత సహకార సంఘాన్ని 1951 ఏప్రిల్ 3వ తేదీన ఆప్కో రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పండిత్ శివలింగు స్థాపించారు. ఈ ప్రాంతంలో ఉన్న పట్కారి (ఖత్రి) పట్టు కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు చేనేత కార్మికులను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. పట్టుచీరలు, పట్టు ధోవతులు, కండువాలు, తలపాగాలు, షర్టింగ్ పట్టు వస్త్రాలను మగ్గాలపై నేసి విక్రయించేందుకు దీన్ని నెలకొల్పారు. ఆర్మూర్ పట్టు చేనేత సహకార సంఘం స్థాపించనప్పుడు 98 మంది చేనేత కార్మికులు ఉండేవారు. 1990లో కార్మికుల సంఖ్య 576 మందికి పెరిగింది. ప్రస్తుతం సుమారు 468 మంది సభ్యులున్నారు. పట్టును బెంగళూరు నుంచి తీసుకొస్తారు. గతంలో కోల్కతా, కశ్మీర్ నుంచి తీసుకొచ్చేవారు. పట్టు వ స్త్రాలు నేసే ముడి సరుకు (అడ్డదారం, నిలువు దారం) ధరలు ప్రస్తుతం పెరగడంతో ఉత్పత్తి చేసిన పట్టువస్త్రాల అమ్మకాల్లో లాభాలు రాకపోవడంతో ఆర్థిక భారంతో నేత పనికి క్రమంగా స్వస్తి పలుకుతున్నారు. ఇక్కడ నేసిన పట్టు వస్త్రాలకు మన రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ పెద్దగా ఆదరణ లేదు. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాందెడ్, బస్మత్, నాయ్గావ్, పర్బనీలో పట్టు వస్త్రాలను విక్రయిస్తారు.
– ఆర్మూర్
సమాచారం
అత్యవసర పరిస్థితులు, శాంతి భద్రతలకు వి ఘా తం కలిగితే సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు..
డయల్ 100
స్పెషల్ బ్రాంచ్ 87126 59777
పోలీస్ కంట్రోల్ రూం 08462 226090
– ఖలీల్వాడి