
పరిశోధనలతోనే నూతన ఆవిష్కరణలు
నిజామాబాద్ రూరల్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ అందుకున్న సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఎస్.గంగాధర్ను పాఠశాలలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలిత మాట్లాడుతూ.. పరిశోధనలతోనే నూతన ఆవిష్కరణలు జరుగుతాయని.. పరిశోధనలు ముందు తరాలకు మార్గ నిర్దేశం చేస్తాయని అన్నారు. ‘తెలంగాణలో స్మృతి కవిత్వం– సమగ్ర పరిశీలన‘ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్న గంగాధర్ తమ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కావడం ఎంతో గర్వకారణమని అభినందించారు. ఆయన భవిష్యత్తులో విద్యార్థులను పరిశోధన వైపు దృష్టి సారించే విధంగా తీర్చిదిద్దుతారని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు సల్ల సత్యనారాయణ, రాధాకృష్ణ, డి.గోపాల్, జావిద్, విద్యాసాగర్, ఘనపురం దేవేందర్, కృష్ణంరాజు, సుజాత, స్వరూప, అనిత, లలిత, శ్రీలత పాల్గొన్నారు.

పరిశోధనలతోనే నూతన ఆవిష్కరణలు