
టీచర్లు, అటెండర్లను నియమించండి
● అమ్మ ఆదర్శ పాఠశాలల బిల్లుల మంజూరు ఆలస్యమవుతోంది.. – రవి, కల్లూరు, ఎంపీటీసీ
● డీఈవో : పనులకు సంబంధించి వివరాలు తెలుసుకుని త్వరలోనే నిధులు విడుదల చేస్తాం.నిధుల కొరత ఎక్కడా లేదు. తక్షణమే అందించేందుకు ఆదేశాలు జారీ చేస్తా.
● మా పాఠశాలలో అటెండర్ లేరు. పాఠశాలకు ఓ స్వచ్ఛంద సంస్థ అందించిన కిటీకీలు అలాగే ఉండిపోయాయి. మూత్రశాలల నిర్వహణ సక్రమంగా లేదు.
– వంశీ, జానకంపేట, వేల్పూర్ మండలం
● ప్రతి పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించండం జరిగింది. మీ పాఠశాలకు కూడా అందుబాటులో ఉన్నారు. అవసర మైతే మండల వి ద్యాశాఖ అధికారి ని సంప్రదించి తె లుసుకుంటా. స్వ చ్ఛంద సంస్థ అందించిన సామగ్రిని ఉపయోగంలోకి తీసుకువస్తాం.
● ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్కేజీకి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. ఫీజు వసూళ్లను నియంత్రించండి. – నరేశ్, నిజామాబాద్
● ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి గవర్నింగ్ బాడీ అందుబాటులో ఉంటుంది. కమిటీ సూచనల మేరకు ఫీజుల నిర్ణయం ఉంటుంది. అయినప్పటికీ ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం విద్యాశాఖ దృష్టికి తీసుకురావాలి.
● వేల్పూర్ మండలం కుకునూర్ పాఠశాలలో పీఈటీ కొరత ఉంది.
– ఆడెపు లింబాద్రి, నిజామాబాద్
● పాఠశాలకు పీఈటీ సర్దుబాటు చేస్తాం. సమీప పాఠశాలలో ఉన్న పీఈటీ అక్కడ కొనసాగే విధంగా చూస్తాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం.
● ఖలీల్వాడి పాఠశాలలో మూత్రశాలలు సక్రమంగా లేవు. – ఇర్ఫాన్, నిజామాబాద్
● పాఠశాలను సందర్శించి మౌలిక సదుపాయాలను పరిశీలిస్తాం. నిధులు అందుబాటులో ఉన్నాయి. మూత్రశాలలు అవసరమైన చోట నిర్మిస్తాం. హెచ్ఎంల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడం జరుగుతుంది.
● ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల అటెండెన్స్పై దృష్టి సారించాలి. ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాఠశాలలకు వెళ్లడం లేదు.
– సంతోష్, నిజామాబాద్
● నిత్యం ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తాం. గైర్హాజరైన టీచర్లపై చర్యలు తీసుకుంటాం. ఎవరికి మినహాయింపు ఉండదు. ప్రతి ఒక్కరూ పాఠశాల సమయంలో విద్యాబోధన చేపట్టాల్సిందే. పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాం.
● ప్రతిఏటా ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు సకాలంలో అందడం లేదు. – నితిన్, బోధన్
● ఈసారి ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ పకడ్బందీగా చేపడుతున్నాం. ఇప్పటికే పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు అందించడం జరిగింది. మరికొన్ని పాఠశాలలకు పంపిణీ కొనసాగుతోంది. ఎక్కడా ఇబ్బందులు లేవు.
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు వసూళ్లను నియంత్రించాలి లైబ్రరీల నిర్వహణపై దృష్టి సారించండి సాక్షి ‘ఫోన్ ఇన్’లో డీఈవో అశోక్కు వినతులు సమస్యలు విన్నవెంటనే పరిష్కారం దిశగా ఆదేశాలిచ్చిన విద్యాశాఖాధికారి
శంకర్ భవన్లో టీచర్ల సంఖ్య తక్కువగా ఉంది..
– గోదావరి, శంకర్ భవన్ పాఠశాల చైర్మన్
ప్రస్తుతం టీచర్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమించడం జరుగుతుంది. సబ్జెక్టుల వారీగా అవసరమైన టీచర్లను నియమిస్తాం.
ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, ఇతర సామగ్రి విక్రయాలపై దృష్టిసారించండి.
– మోహన్, డిచ్పల్లి
ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, ఇతర సామగ్రి విక్రయాలపై దృష్టి సారిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటాం.
నిజామాబాద్ అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, అటెండర్లను నియమించాలని, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు వసూళ్లను నియంత్రించాలని పలువురు జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ను కోరారు. వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, పరిష్కారమార్గాలు, నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థుల మార్గదర్శకాల కోసం మాట్లాడేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉదయం 11 నుంచి 12గంటల వరకు జిల్లాకు చెందిన పలువురు వివిధ అంశాలపై జిల్లా విద్యాశాఖాధికారితో మాట్లాడారిలా..
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాల్లో ప్రైవే ట్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. – రామ్మోహన్, వర్ని
అనుమతులు ఇచ్చే సమయంలోనే భవనాలు నిబంధనలకు అనుకూలంగా ఉన్నాయా? లేదా? పరిశీలిస్తాం. అగ్నిమాపక శాఖ, మున్సిపల్ అనుమతులను పరిశీలించిన తరువాత మేము అనుమతులిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలకు నోటీసులు ఇస్తాం.
ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీల నిర్వహణ సక్రమంగా లేదు. పుస్తకాలు అందుబాటులో లేవు. – రవి, ఆర్మూర్
ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే లైబ్రరీలు కొనసాగుతున్నాయి. వాటిలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నా యి. నిర్వహణ తీరును పరిశీలించి మరింత బలోపేతం చేస్తాం.

టీచర్లు, అటెండర్లను నియమించండి