సెంట్రల్‌ జైలును సందర్శించిన జడ్జి | - | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ జైలును సందర్శించిన జడ్జి

Jun 12 2025 3:31 AM | Updated on Jun 12 2025 3:31 AM

సెంట్

సెంట్రల్‌ జైలును సందర్శించిన జడ్జి

నిజామాబాద్‌ లీగల్‌ : సారంగాపూర్‌లోని సెంట్రల్‌ జైలును జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవీఎన్‌ భరతలక్ష్మి బుధవారం సందర్శించారు. జైలులోని వివిధ విభాగాలను పరిశీలించిన జడ్జి.. ఖైదీలతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, లీగల్‌ ఎయిడ్‌ న్యాయవాదులు అందిస్తున్న న్యాయ సహాయం వి వరాలు తెలుసుకున్నారు. ఖైదీలు తయా రు చేస్తున్న వస్తువులను పరిశీలించారు. జైలులో సౌకర్యాలపై న్యాయమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జి వెంట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్‌రావు, జైలు సూపరింటెండెంట్‌ దశరథ్‌, జైలర్లు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, జైలు సిబ్బంది తదితరులున్నారు.

శాంతి భద్రతలకు విఘాతం

కలిగిస్తే చర్యలు

ఖలీల్‌వాడి: అల్లర్లకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించిన వారిపై నిఘా ఉంటుందని, అటువంటి వ్యక్తులు తమ నడవడికను మార్చుకోవాలని సీపీ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లేనిపక్షంలో తగిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పాతకక్షలను మనసులో పెట్టుకొని ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సిర్నాపల్లిలో ఇటీవల మాజీద్‌ ఖాన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. ఎవ్వరి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగించే లేదా సమాజంలో ఉద్రిక్తతలు రేపే విధంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. శాంతియుత వాతావరణం కోసం పోలీస్‌శాఖ నిర్విరామంగా కృషి చేస్తుందని, దీనికోసం ప్రజల సహకారం ప్రధానమని పేర్కొన్నా రు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి సమాచారాన్ని దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌లకు లేదా డయల్‌ 100, స్పెషల్‌ బ్రాంచ్‌ నంబర్‌ – 87126 59777, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 08462 – 226090 నంబర్లకు తెలుపాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

బోధనా సామర్థ్యాలు మెరుగుపర్చుకోవాలి

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): గురుకులాల అధ్యాపకులు బోధనా సామర్థ్యాలు, మెలకువలను పెంపొందించుకుని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించాలని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల ఉమ్మడి జిల్లా ఆర్‌సీవో సత్యనాథ్‌రెడ్డి అన్నారు. మండలంలోని కంజర్‌ బీసీ గురుకులంలో జూనియర్‌ లెక్చరర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సత్యనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. అధ్యాపకుల బోధనా సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు ఓరియంటేషన్‌ ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని 100 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.

సెంట్రల్‌ జైలును  సందర్శించిన జడ్జి
1
1/2

సెంట్రల్‌ జైలును సందర్శించిన జడ్జి

సెంట్రల్‌ జైలును  సందర్శించిన జడ్జి
2
2/2

సెంట్రల్‌ జైలును సందర్శించిన జడ్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement