
ట్రాన్స్ఫార్మర్ కాపర్, ఆయిల్ చోరీ
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోని లక్ష్మి లిప్టు కోసం ముప్కాల్ మండలం నల్లూర్ శివారులో నిర్మించిన సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్పార్మర్ కాపర్ కాయిల్స్, ఆయిల్ చోరీకి గురైంది. లిప్టు ఆపరేటర్ భానుచందర్ బుధవారం ఉదయం సబ్స్టేషన్ వద్దకు వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై బుధవారం ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ విచారణ చేపట్టారు. మే31 నుంచి జూన్ 10 మధ్య కాలంలో చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుండగులు రెండు ట్రాన్స్ఫార్మర్లను కింద పడేసి కాపర్ కాయిల్స్, ఆయిల్ ఎత్తుకెళ్లారు. లక్ష్మి లిప్టు డిప్యూటీ ఈఈ సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి అదృశ్యం
నవీపేట: మండల కేంద్రంలోని శివాజీనగర్కు చెందిన వగిరె విక్కీ(25)అదృశ్యమైనట్లు ఎస్సై వినయ్ బుధవారం తెలిపారు. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన విక్కీ మతిస్థిమితం కోల్పోయాడన్నారు. ఈనెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన విక్కీ మళ్లీ ఇంటికి తిరిగిరాలేడు. దీంతో అతడి భార్య నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.