
ధరణిలో అన్ని భూముల వివరాలు నమోదు చేయించాలి
సుభాష్నగర్: ధరణి పోర్టల్లో అన్ని భూముల వివరాలను రెవెన్యూశాఖ ద్వారా ఎంట్రీ చేయించాలని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్రెడ్డి బుధవారం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కోరారు. హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు. ఈసందర్భంగా మార్ట్గేజ్ ద్వారా దీర్ఘకాలిక రుణాలు పొందిన వారి భూముల వివరాలు నమోదు కాలేదని, ధరణి పోర్టల్లో నమోదు చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని రమేష్రెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. పాత రికార్డుల్లో వివరాలు నమోదయ్యాయని, ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఎంట్రీ కాలేవన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నమోదు చేయిస్తామని తెలిపినట్లు రమేష్రెడ్డి తెలిపారు.
అంగన్వాడీలకు శిక్షణ
ఎడపల్లి: మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు నూతన జాతీయ విద్యా విధాన, రివై జ్ ఫ్రీ స్కూల్ అనే అంశాలపై బుధవారం శిక్షణ నిర్వహించారు. మూడు రోజుల శిక్షణ తరగతు ల్లో భాగంగా వీడియో బోధన ద్వారా ఎడపల్లి, రెంజల్, అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. బోధన్ సీడీపీవో జానకి మాట్లాడు తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన వి ద్యా విధానంలో రివైజ్ ప్రీ స్కూల్పై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు ప్రమీల, ఎడపల్లి మండల సూపర్వైజర్ విజయ రాణి, బాల్య సంరక్షణ అధికారి నరేశ్, శిక్షకులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.