వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ | PM Modi Arrives At Ahmedabad Stadium To Watch Ind Vs Aus 2023 ODI World Cup Final Match, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ

Nov 19 2023 9:04 PM | Updated on Nov 19 2023 9:50 PM

PM Modi Arrives At Ahmedabad Stadium To Watch Ind vs Aus - Sakshi

అహ్మదాబాద్: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్‌ని వీక్షించారు. 

క్రికెట్ వరల్డ్‌కప్‌లో నేడు భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. మొదట ‍బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 10 వికెట్లు కోల్పోయి 240 పరుగులు సాధించింది. 

241 పరుగుల లక్ష‍్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట్లో కాస్త తడబడింది. కానీ లబుషేన్, రాబిన్ హెడ్‌లు నిలదొక్కుకుని ఆస్ట్రేలియాను విజయానికి చేరువ చేశారు. లబుషేన్ అర్ధసెంచరీ, రాబిన్ హెడ్ సెంచరీతో చెలరేగిపోయారు.  

ఇదీ చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కలకలం.. ఫ్రీ-పాలస్తీనా టీషర్ట్‌తో మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement