జాతీయ ఉత్తమ టీచర్లు: ఏపీ, తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక | National Best Teacher Award: 2 Members Selected From AP 2 Telangana | Sakshi
Sakshi News home page

National Best Teacher Award: ఏపీ, తెలంగాణ నుంచి నలుగురు

Aug 18 2021 5:13 PM | Updated on Aug 18 2021 5:43 PM

National Best Teacher Award: 2 Members Selected From AP 2 Telangana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 44 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. కాగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.

విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్‌ ఉపాధ్యాయుడు భూషణ్‌ శ్రీధర్‌, చిత్తూరు జిల్లా ఎం.పైపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మునిరెడ్డికి అవార్డులు లభించాయి. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. కే. రంగయ్య, పయ్యావుల రామస్వామి బెస్ట్‌ టీచర్స్‌గా ఎంపికయ్యారు.

చదవండి: Appsc: సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారి జాబితా విడుదల
Muharram 2021 In AP: ఆంధ్రప్రదేశ్‌లో 20న మొహర్రం సెలవు

Advertisement
 
Advertisement
Advertisement