ఎంపీ, ఎమ్మెల్యే మధ్య తిట్ల పురాణం | MP, MLA Slams Each Other In Karnataka | Sakshi
Sakshi News home page

ఎంపీ, ఎమ్మెల్యే మధ్య తిట్ల పురాణం

Aug 15 2021 7:56 AM | Updated on Aug 15 2021 1:11 PM

MP, MLA Slams Each Other In Karnataka - Sakshi

ఎమ్మెల్యే శ్రీనివాస్, ఎంపీ బసవరాజు వాగ్వాదం

తుమకూరు(కర్ణాటక): రైతులకు అబద్ధపు హామీలు ఇచ్చుకుంటూ వారిని మాయ చేస్తున్నారని బీజేపీ ఎంపీ బసవరాజుపై జేడీఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ విమర్శలు చేయగా, ఎంపీ సైతం వాగ్బాణాలు సంధించడంతో పరిస్థితి వేడెక్కింది. గుబ్బి తాలూకా చేళూరు హోబళి సి.నందిహళ్లిలో కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం అధికారులతో ఎంపీ వివరాలు తెలుసుకుంటున్నారు.

ఈ సమయంలో రైతుల కోసం నీటి ప్రాజెక్టు కట్టడానికి  కేంద్రం రూ. 500 కోట్లు విడుదల చేసిందని ఎంపీ చెప్పారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌ కలుగజేసుకుని అసత్య హామీలు, మాటలు చెప్పొద్దంటూ ఎంపీపై గట్టిగా మాట్లాడారు. ఎంపీ కూడా ఎమ్మెల్యేకు ఘాటుగా హెచ్చరికలు చేయడంతో అధికారులు, నేతలు నచ్చజెప్పి పంపించారు. కాగా, ఎంపీ, ఎమ్మెల్యే మధ్య తిట్ల పురాణంతో సభ వేడెక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement