ప్రియురాలి కోసం ప్రియుడి సాహసం.. కట్‌ చేస్తే | Man From PoK Crosses Line Of Control To Meet J&K Woman He Met Online | Sakshi
Sakshi News home page

ప్రియురాలి కోసం సరిహద్దు దాటాడు.. కట్‌ చేస్తే

Jun 1 2026 12:45 PM | Updated on Jun 1 2026 1:04 PM

Man From PoK Crosses Line Of Control To Meet J&K Woman He Met Online

ప్రియురాలి కోసం సరిహద్దులు దాటే సాహసం చేసిన ఒక యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ఆన్‌లైన్‌లో పరిచయమైన జమ్మూ కాశ్మీర్ యువతిని కలవడానికి  పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని (పీవోకే) ముజఫ్ఫరాబాద్‌కు చెందిన యువకుడు జీషాన్‌ మిర్‌ (22)ని నియంత్రణ రేఖ (LoC) భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. విచారణలో అసలు విషయం చెప్పాడు.  దీంతో ఈ స్టోరీ నెట్టింట్‌ వైరల్‌గా మారింది.

జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌కు చెందిన  ప్రియురాల్ని  కలవాలన్న అతని కోరికకు  సరిహద్దు గీత వద్దే ఎదురు దెబ్బ తగిలింది.  ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్ పరిధిలోని 'సిలికోట్' ప్రాంతంలో ఒక వ్యక్తి నియంత్రణ రేఖ దాటి రావడాన్ని సైనికులు గమనించారు. అతను భారత భూభాగంలోకి అడుగుపెట్టిన వెంటనే సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో అతను పీఓకేలోని ముజఫరాబాద్‌కు చెందిన పెయింకాడి నివాసి జీషాన్ అహ్మద్ మీర్ (తండ్రి లాల్ దిన్ మీర్) గా గుర్తించారు. అతని వద్ద ఉన్న పాకిస్తానీ గుర్తింపు కార్డు (ID Card)ద్వారా అతని వివరాలను ధృవీకరించారు. 

సోషల్ మీడియా ద్వారా ఉరి ప్రాంతానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆమెను కలుసుకోవడానికే తాను ప్రాణాలకు తెగించి సరిహద్దు దాటానని జీషాన్ భద్రతా సిబ్బందికి తెలిపాడు. ప్రస్తుతం జీషాన్‌తో పాటు అతను చెప్పిన యువతిని కూడా భద్రతా సంస్థలు విచారిస్తున్నాయి. వారి మధ్య జరిగిన డిజిటల్ సంభాషణలను (చాట్స్) అధికారులు పరిశీలిస్తున్నారు.

సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు సోపోర్ యువకుల అరెస్ట్
మరొక ఘటనలో, శనివారం మరియు ఆదివారం మధ్య రాత్రి హత్లంగా-నంబ్లా మార్గం ద్వారా పీఓకేలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు సోపోర్ నివాసితులను సైన్యం అదుపులోకి తీసుకుంది.  వీరిలో  ఆదిల్ హుస్సేన్ దార్, ఇష్ఫాక్ అహ్మద్, జాఫర్ అహ్మద్‌లుగా గుర్తించారు. వీరిలో ఆదిల్ హుస్సేన్ దార్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న టెరిటోరియల్ ఆర్మీ (TA-161) సిబ్బంది కావడం గమనార్హం.వారు నియంత్రణ రేఖను చేరుకోవడానికి ముందే నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ వారిని పట్టుకుంది. వీరు సరిహద్దు దాటడానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.

ఇదీ చదవండి: కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్‌ఫ్లూయెన్సర్‌

Advertisement
 
Advertisement
Advertisement