Madhya Pradesh: నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్‌ | Madhya Pradesh Bans Liquor In 19 Religious Cities Effective From Today, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Madhya Pradesh: నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్‌

Apr 1 2025 8:08 AM | Updated on Apr 1 2025 10:39 AM

Madhya Pradesh Bans Liquor in Religious Cities Effective from Today

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మోహన్ యాదవ్ సర్కారు(Mohan Yadav government) మద్యం నిర్మూలన దిశగా చారిత్రాత్మక అడుగు వేసింది. రాష్ట్రంలోని 19 పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు (ఏప్రిల్ 1, 2025) నుంచి మద్యం దుకాణాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అహల్యాబాయి నగరంగా పేరొందిన మహేశ్వర్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మద్యం దుకాణాలను మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ నిర్ణయం దరిమిలా ఈరోజు అంటే ఏప్రిల్‌ ఒకటి(April 1st) నుంచి రాష్ట్రంలోని ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, మండలేశ్వర్, ఓర్చా, మైహార్, చిత్రకూట్, దతియా, పన్నా, మాండ్లా, ముల్తాయ్, మందసౌర్, సల్కన్‌పూర్ పంచాయితీ, అమర్‌కంటక్‌ పట్టణం, బర్మాన్‌కలన్, బర్మన్‌ఖుర్డ్, లింగ తదితర ప్రాంతాల్లోని అన్ని మద్యం దుకాణాలను, బార్‌లు మూసివేయనున్నారు.

మధ్యప్రదేశ్‌లోని 19 పట్టణ, గ్రామీణ ప్రాంతాలను పవిత్రమైనవిగా ప్రకటించిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మద్యపాన నిషేధం(Prohibition of alcohol) విధించింది. ఈ జాబితాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఆరు మున్సిపల్ కౌన్సిల్‌లు, ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మద్యపాన వ్యసన నిర్మూలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసిందని ముఖ్యమంత్రి డాక్టర్ యాదవ్ పేర్కొన్నారు. సీఎం సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ తమ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని మతపరమైన ప్రదేశాలలో నెలకొన్న అసమానతలపై చర్చించామన్నారు. ఉజ్జయినిలో ఆలయానికి ఒక కిలోమీటరు పరిధిలో మాత్రమే మద్యాన్ని నిషేధించామన్నారు. రాష్ట్రమంతటా మద్యాన్ని నిషేధించాలని అనుకోవడం లేదన్నారు. మతపరమైన నగరాల్లో మాత్రమే మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించామని తెలిపారు. 

ఇది కూడా చదవండి: చిరాగ్‌ పాశ్వాన్‌ తల్లి గదికి తాళం.. రోడ్డునపడ్డ కుటుంబ కలహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement