ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది నక్సల్స్‌ మృతి | 12 Naxalites killed in Chhattisgarh in 3rd major encounter | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది నక్సల్స్‌ మృతి

May 11 2024 5:57 AM | Updated on May 11 2024 5:57 AM

12 Naxalites killed in Chhattisgarh in 3rd major encounter

చర్ల: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిజాపూర్‌ జిల్లాలో శుక్రవారం మరో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. గంగలూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ సాగిస్తున్న భద్రతా బలగాలపై నక్సల్స్‌ కాల్పులకు దిగారు. ఇరువురి నడుమ ఎదురుకాల్పులు గంటలపాటు కొనసాగాయి. 

కాల్పుల అనంతరం ఘటనా ప్రాంతంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ తెలిపారు. అదేసమయంలో, మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. 

ఆ ప్రాంతంలో ఒక బారెల్‌ గ్రెనేడ్‌ లాంఛర్, 12 బోర్‌ గన్, దేశవాళీ రైఫిల్, భారీగా పేలుడు పదార్థాలు లభించాయన్నారు.   ఏప్రిల్‌ 16, 30వ తేదీల్లో చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు చనిపోవడం తెల్సిందే. బస్తర్‌ ప్రాంతంలో ఈ ఏడాదిలో వివిధ ఎన్‌కౌంటర్లలో103 మంది నక్సల్స్‌ చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement