
నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యం
కోస్గి: కొడంగల్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి సాధించి రాష్ట్రంలోనే నంబర్ నియోజకవర్గంగా మారుతుందని, రానున్న అతి తక్కువ సమయంలోనే కొడంగల్ నియోజవర్గ దశదిశ మారుతుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ తిరుపతిరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం కోస్గి మున్సిపల్ పరిధిలో రూ.305 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయనతోపాటు కడా చైర్మన్ వెంకట్రెడ్డి, ఇతర అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు పక్కన బెట్టి ప్రజలందరు మన ప్రాంతం అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అంతకు ముందు కోస్గి మున్సిపల్ పరిధిలో తాగునీటి సరఫరా పథకానికి రూ.15.99 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం రూ.145.81 కోట్లు, వరద నీటి కాల్వల నిర్మాణం కోసం రూ.72.28 కోట్లు, చెరువుల సుందరీకరణ కోసం రూ.5.99 కోట్లు, అంతర్గత రహదారులు రూ.61.60 కోట్లతో చేపట్టనున్న పనులకు భూమి పూజ చేశారు. వార్ల విజయ్ కుమార్, రఘువర్దన్రెడ్డి, బెజ్జు రాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కోస్గిలో రూ.305 కోట్ల అభివృద్ధి
పనులకు భూమి పూజ