
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
కొత్తపల్లి: త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని జెడ్పీ సీఈఓ శైలేష్కుమార్ అధికారులను అదేశించారు. శుక్రవారం కొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. మండలంలో ఎంపీటీసీ స్థానాల విభజన, ఓటర్ల జాబితా, ఎన్ని పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలను ఎంపీడీఓ కృష్ణారావును అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా మండలంలోని నర్సరీల్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఏఏ రకాలు ఎక్కడెక్కడా నాటుతున్నారనే ఆరా తీశారు. వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటాలని ఆదేశించారు.