
యోగా డేను విజయవంతం చేయాలి
నారాయణపేట: దశాబ్ది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రానికి సమీపంలోని అభినందన గార్డెన్లో శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట ప్రభుత్వం, నారాయణపేట ఆయుష్ డిపార్ట్మెంట్, పతంజలి యోగా సమితి, సేవా భారతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అధికారులు, ప్రజలు మీడియా ప్రతినిధులు భాగస్వాములు కావాలని, ప్రతిరోజు యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ప్రాణాయామ,ం మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి
నారాయణపేట రూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో సిటిజన్ క్లబ్ నుండి శ్రీ సత్యనారాయణ చౌరస్తా స్వామి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి జయ చంద్రమోహన్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పతంజలి యోగ సమితి సభ్యులు, సేవ భారత్ సభ్యులు, అయుష్మాన్ భారత్ అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాను మన దినచర్యలో భాగం చేసుకోవాలని, నేటి ఉరుకులు పరుగుల జీవితంలో శారీరక శ్రమ తగ్గిందని, ఊబకాయం పెరిగిందని, మన దేశం వేలాది సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉన్న యోగా, దాని లాభాలు ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఆచారిస్తున్నాయన్నారు. న మనం ప్రతిరోజు యోగ ఆసనాలు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో పట్టణంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సురేష్, రాజులహోటి, శివకుమార్, నందు నామాజీ, రఘువీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, శనివారం జిల్లా కేంద్రంలోని నిర్వహించే కార్యక్రమంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు నేటి సమాజానికి యోగా ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామని సురేష్, శివకుమార్, శ్రీనివాస్ గౌడ్, యశ్వంత్, భాస్కర్ రెడ్డి తెలిపారు.
నేడు జిల్లా వ్యాప్తంగా సామూహిక యోగా కార్యక్రమాలు