ఘనంగా సీపీ బ్రౌన్ జయంతి
నంద్యాల: తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన బ్రిటిష్ అధికారి సీపీ బ్రౌన్ జయంతిని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సీపీ బ్రౌన్ చిత్రపటానికి ఎస్పీ సునీల్ షెరాన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీ బ్రౌన్ (చార్లెస్ ఫిలిప్ బ్రౌన్) 1798 నవంబర్10న కలకత్తాలో జన్మించారని, తరువాత 1817లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరి, 1820 ఆగస్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా పనిచేశారన్నారు. ఆయనకు తెలుగు భాషపై ఎంతో ప్రేమ పెరిగి పాత పుస్తకాలను సేకరించారన్నారు. వాటిని సవరించి మళ్లీ ముద్రించి, మన భాషను భవిష్యత్తుకు సురక్షితం చేశారన్నారు. ఆయన వేమన శతకాలు, కవి తిక్కన, నన్నయ్య మరియు అనేక తెలుగు సాహిత్య కృతులను రక్షించి ప్రసిద్ధం చేశారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.


