
పట్టు తప్పితే అంతే!
నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు. తమ వెనుక ఓ కుటుంబం ఉందనే విషయాన్ని మరచి నిర్లక్ష్యంగా ప్రయాణం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఓ బాలుడు ట్రాక్టర్ ఇంజిన్కు గొర్రును తగిలించుకుని దానిపై కూలీలను ఎక్కించుకుని ప్రమాదకరంగా తీసుకెళ్తున్నాడు. ఏమాత్రం పట్టు తప్పినా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయే ఈ దృశ్యాలు కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో మంగళవారం కనిపించాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు

పట్టు తప్పితే అంతే!