
శోచనీయం
గ్రామాల అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 2వ విడత 15వ ఆర్థిక సంఘం నిధులు నేటికీ విడుదల కాకపోవడం దారుణం. మండల పరిషత్తుకు విడుదలయ్యే ఈ నిధులతో పలు అభివృద్ధి పనులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నేటికీ ఎంపీపీ, ఎంపీటీసీలకు కూడా గౌరవ వేతనాలు కూడా విడుదల చేయకపోవడం శోచనీయం.
– నారాయణదాస్, ఎంపీపీ, పత్తికొండ
సొంత నిధులు వెచ్చిస్తున్నాం
పాలక ప్రభుత్వాలు 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీంతో ప్రజలకు మౌలిక వసతులను కల్పించేందుకు అవసరమైన పనులకు సొంత నిధులను వెచ్చిస్తున్నాం. గత ఏడాది నవంబర్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులు విడుదల చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడుతోంది.
– ఉప్పరి నాగేంద్ర, సర్పంచ్, జోళదరాశి,
కోవెలకుంట్ల మండలం
పంచాయతీలకు ఆర్థిక
సంఘం నిధులే ఆధారం
గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులే ఆధారం. సకాలంలో ఈ నిధులు విడుదలైతే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇతరత్రా ఆదాయ వనరులు లేని గ్రామ పంచాయతీల్లో ప్రస్తుత వర్షాకాలంలో వీధుల్లోని రోడ్లపై బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం 2వ విడత నిధులు విడుదలయ్యేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. – బీ మద్దిలేటి, సర్పంచ్,
సల్కాపురం, కల్లూరు మండలం

శోచనీయం

శోచనీయం