
కొత్త రేషన్ కార్డులకు.. మూడు నెలల తర్వాతే బియ్యం
నల్లగొండ : కొత్తగా రేషన్ కార్డులు మంజూరవుతున్న వారికి మూడు నెలల తర్వాతే బియ్యం అందనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యాన్ని జూన్లోనే ఒకే సారి ఇస్తుడడంతో.. మే 20వ తేదీ తర్వాత కార్డులు పొందిన వారికి సెప్టెంబర్లోనే సన్నబియ్యం అందనున్నాయి. గతంలో ఉన్న కార్డులతోపాటు అయితే మే 20వ తేదీ కంటే ముందు కార్డులు పొందిన వారికి కోటా ప్రకారం ప్రభుత్వం బియ్యం విడుదల చేసింది. కానీ ఆ తర్వాత కార్డులు పొందిన వారికి కోటా ఇవ్వకపోవడంతో.. వారంతా మూడు నెలలపాటు ఆగాల్సిందే.
జిల్లాలో 4,84,216 రేషన్కార్డులు
ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూసే వారికి ప్రభుత్వం కార్డులను మంజూరు చేస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి అన్ని స్థాయిలో పరిశీలన పూర్తయ్యాక కార్డులు జారీ చేస్తోంది. ఈ ప్రక్రియను ఏప్రిల్ నెల నుంచి ప్రారంభించింది. ఇలా మే 20వ తేదీ వరకు జిల్లాలో కొత్తవి, పాతవి కలిపి మొత్తం 4,84,216 రేషన్కార్డులు ఉన్నారు. అయితే వీటికి సంబంధించి 26 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం మూడు నెలల కోసం అలాట్ చేసింది. ఆయా కార్డుదారులకు ప్రస్తుతం బియ్యం పంపిణీ కొనసాగుతోంది.
60 శాతం కోటా పంపిణీ పూర్తి
మూడు మాసాలకు సంబంధించి బియ్యం పంపిణీని ఈ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ షాపులకు 80 శాతం బియ్యం సరఫరా అయ్యాయి. అందులో 60 శాతం బియ్యం శుక్రవారం సాయంత్రానికి రేషన్కార్డుదారులకు పంపిణీ చేశారు.
41,806 మంది కొత్తగా దరఖాస్తు..
జిల్లాలో ప్రస్తుతం 41,806 మంది కొత్త రేషన్కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అందులో 819 రిజక్ట్ అయ్యాయి. 31,530 కార్డులు అప్రూవల్ అయ్యాయి. ఇందులో పరిశీలన కోసం 9,422 కార్డులు ఉండగా.. తహసీల్దార్ లాగిన్లో 498, డీఎస్వో లాగిన్లో 195 ఉన్నాయి. ఇవి కూడా ఆయా స్థాయిల్లో అప్రూవల్ కానున్నాయి. అయితే మే 20వ తేదీ తర్వాత సుమారు 20 వేల కొత్త కార్డులు జారీ అయ్యాయి. వారందరికీ సెప్టెంబర్లోనే బియ్యం అందనున్నాయి. మూడు మాసాలకు సంబంధించిన బియ్యం ఇప్పటికే అలాట్ చేసినందున మే 20 తర్వాత వచ్చిన కార్డులకు సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం ఇవ్వనున్నట్లు డీఎస్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఫ మే 20వ తేదీ తర్వాత మంజూరైన కార్డులకు సెప్టెంబర్లో కోటా
ఫ సుమారు 20 వేల మంది
మూడు నెలలు ఆగాల్సిందే
ఫ ప్రస్తుత కోటా 60 శాతం పంపిణీ పూర్తి