మత్తు మందుల మాఫియా! | - | Sakshi
Sakshi News home page

మత్తు మందుల మాఫియా!

Jun 14 2025 10:04 AM | Updated on Jun 14 2025 10:04 AM

మత్తు మందుల మాఫియా!

మత్తు మందుల మాఫియా!

నల్లగొండ పట్టణానికి చెందిన యువకుడు ప్రణీత్‌కుమార్‌ (పేరు మార్చాం) ఇంజనీరింగ్‌ పూర్తి చేసి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ యువకుడు గంజాయి, మత్తు పదార్థాలకు బానిసై చిన్నచిన్న గొడవలు చేస్తున్నాడు. అతడికి గంజాయి దొరకపోవడంతో.. మందుల దుకాణాల్లో దొరికే మత్తు ఇంజక్షన్లు కొనుగోలు చేస్తూ రోజూ వాడుతున్నాడు. ప్రకాశం బజార్‌లోని ఒక మందుల దుకాణంలో రోజూ మత్తు ఇంజక్షన్‌ కొనుగోలు చేస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనతో వెల్లడైంది. ఇప్పుడు అతని ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రి పాలయ్యాడు. చేతికొచ్చిన కొడుకు.. తమని ఆదుకుంటాడని భావించిన తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చాడు. మత్తు మందుల మాఫియా కారణంగానే తమ కుమారుడు అనారోగ్యం పాలయ్యాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ.. జిల్లాలో మత్తు మందుల విచ్చలవిడి విక్రయంతో జరుతున్న తీరు.

ఇతరుల సర్టిఫికెట్లతో వ్యాపారం..

ఉమ్మడి జిల్లాలో సుమారు రెండు వందలకు పైగా ఔషధ నియంత్రణ శాఖ ద్వారా లైసెన్స్‌ను పొందిన దుకాణాలు ఉన్నాయి. ఇవి కాక.. అనుమతులు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో మరో 50 వరకు వరకు ఉంటాయి. మందుల దుకాణాలను నిర్వహించే వ్యాపారులు కచ్చితంగా డీ పార్మసీ లేదా ఎం.ఫార్మసీ సర్టిఫికెట్‌ పొందిన వారై ఉండాలి. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సగం దుకాణదారులు ఫార్మసీ సర్టిఫికెట్లు ఉన్న వ్యక్తులకు నెలకు కొంత మొత్త ఇస్తూ.. వారి సర్టిఫికెట్లతో లైసెన్స్‌ను పొంది వ్యాపారం చేస్తున్నారు. దీంతో వారికి డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్‌ అర్థం కాక.. ఇష్టం వచ్చిన మందులను అమ్మి రోగుల జీవితాలతో చలగాటం ఆడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇకడబ్రాండెడ్‌ కంపెనీల మందుల పేరుతో జనరిక్‌ మందులను కొందరు మందులను అంటగట్టి వారి జేబులు నింపుకుంటున్నారని ఆరోపణలు సైతం ఉన్నాయి.

డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండానే

మత్తు ఇంజక్షన్ల విక్రయం

ఇష్టానుసారంగా వాడుతున్న యువత

నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఔషధ నియంత్రణ శాఖ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement