పనిచేసే వారికి పార్టీ పదవులు | - | Sakshi
Sakshi News home page

పనిచేసే వారికి పార్టీ పదవులు

Jun 14 2025 10:04 AM | Updated on Jun 14 2025 10:04 AM

పనిచేసే వారికి పార్టీ పదవులు

పనిచేసే వారికి పార్టీ పదవులు

నకిరేకల్‌ : కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేసి చేసే వారందరికీ పార్టీ పదవుల్లో సుముచిత స్థానం దక్కుతుందని రాష్ట్ర పశు సంవర్థక, పాడి, మత్స్య, క్రీడల యువజన సర్వీస్‌ల శాఖ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శుక్రవారం సాయంత్రం తొలిసారి ఆయన నకిరేకల్‌ వచ్చారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తాను కూడా కాంగ్రెస్‌ పార్టీలో కౌన్సిలర్‌ స్థాయి నుంచి నేడు మంత్రిగా ఎదిగానని.. అదే పార్టీ గొప్పతనం అన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజ్‌ నేతృత్వంలో ప్రజలు, నాయకుల మధ్యే పార్టీ కమిటీల ఎన్నికలు జరగాలని స్పష్టం చేశారని పేర్కొన్నారు. తొలిసారిగా కార్యకర్తలు, నాయకుల సమక్షంలో జిల్లా, మండల, పట్టణ, గ్రామ అధ్యక్షులను, ఇతర కమిటీలను ఎన్నుకోనున్నామని చెప్పారు. ప్రతి పదవికి మూడు పేర్లు తీసుకుని ఎన్నిక చేసేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందన్నారు. పనిచేసే వారంతా పార్టీ పదవుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ కమిటీల నియమకం చేస్తున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, పార్టీ జిమ్లే పరిశీలకుడు నాసర జయబాబా, మార్కెట్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు గుత్తా మంజుల మాధవరెడ్డి, చౌగోని రజితా శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, ఏసుపాదం, వెంకన్న, సుక్కయ్య, ఉశయ్య, శ్రీని వాస్‌, గంగధర్‌రావు, కొండయ్య, నర్సింహ, యాదగిరి, మల్లికార్జున్‌, పన్నాల రాఘవరెడ్డి, సత్తయ్య, సుందర్‌, నకిరెకంటి నరేందర్‌ పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement