
ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి
తిప్పర్తి : రైతులు ఉద్యాన పంటలు సాగుచేసి అధిక లాభాలను పొందాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం తిప్పర్తి మండలం అంతయ్యగూడం గ్రామంలో రైతు సిరిగిరి కమలాకర్రెడ్డి సాగు చేస్తున్న అంజీర పంటను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు.. పంట ఎక్కడ అమ్ముతున్నారు.. మార్కెట్ ఎలా ఉంది.. నీటి సౌకర్యం ఉందా, ఫాం పాండ్ నిర్మించుకున్నారా.. బ్రాండింగ్.. మార్కెటింగ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు అంజీర పంటను బ్రాండింగ్ చేసేందుకు పరిశీలించామన్నారు. స్థానిక స్వయం సహాయక మహిళా సంఘాల సహకారంతో వీలైతే ఒక రైతు ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించి దాని ద్వారా మార్కెటింగ్ చేయించాలని ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డిని ఆదేశించారు. ఈ సందర్భంగా రైతు కమలాకర్రెడ్డి, సుగుణమ్మ దంపతులను సన్మానించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ..
తిప్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి అనంతరెడ్డి, తహసీల్దార్ పరుశురాం, ఎంపీడీఓ వెంటేశ్వర్రెడ్డి, ఏఓ సన్నిరాజు, శ్రీనివాస్రెడ్డి రైతులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి