
చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.63,09,560
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం ఆలయ సిబ్బంది లెక్కించారు. 79 రోజులకు గాను రూ.63,09,560 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి నవీన్కుమార్ వెల్లడించారు. అన్నదానానికిగాను రూ.49,512 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకురాలు సుమతి, సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వర శర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది శ్రీనివాస్రెడ్డి, నర్సిరెడ్డి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.