
మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలి
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో అధికారులు, సిబ్బంది బాధ్యతతో పనిచేసి మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. సోమవారం నీలగిరి మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న సమయంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న మంత్రి ప్రతి విభాగానికి వెళ్లి అక్కడ ఉన్న ఉద్యోగులు, సిబ్బందితో మాట్లాడారు. ఇంజనీరింగ్ విభాగానికి వెళ్లిన మంత్రి అక్కడి ఈఈ, ఏఈలతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో సీడీపీ, ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన 180 పంచాయతీరాజ్ పనుల్లో నాణ్యత లేవంటూ వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇన్చార్జి అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ్కు ఫోన్లో ఆదేశించారు. రెవెన్యూ విభాగంలో ఆస్తి పన్ను వసూలు, గతంలో జరిగిన అక్రమాలపై ఆరా తీశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా జీదాలు ఇస్తున్నారా.. లేదా అని ఆరాశీశారు. అక్కడ వివిధ రికార్డులను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఫ నీలగిరి మున్సిపల్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ