
సాంఘిక బహిష్కరణ చేసిన వారిని శిక్షించాలి
ఎస్ఎస్తాడ్వాయి: గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని కాటాపూర్లో కల్లుగీత కార్మిక సంఘం సొసైటీ అధ్యక్షుడు గడ్డం శ్రీధర్ ఆధ్వర్యంలో గీత కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ఎర్రగట్టు మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గీతకార్మికులను సాంఘిక బహిష్కరణ చేసి, శ్రీరామనవమి పండుగ రోజు గుడిలోకి వచ్చిన మహిళలను అవమానపరచడంతోపాటు, ఈతచెట్లను ధ్వంసం చేసిన వీడీసీ సభ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రంగు సత్యనారాయణ, రంగు లాలయ్య, గండు సదానందం, సురేష్, రంగు రాజు, లింగాల వెంకన్న, సురేష్, మార్క ప్రణయ్, గట్టు వసంత్, కక్కెర్ల వెంకటేష్, గీత కార్మికులు పాల్గొన్నారు.
కల్లుగీత కార్మిక సంఘం
జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య