శ్రుతీహాసన్‌ షాకింగ్‌ నిర్ణయం.. ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌ | Shruti Haasan Take Break From Social Media | Sakshi
Sakshi News home page

‘కూలీ’ రిలీజ్‌కు ముందు శ్రుతీహాసన్‌ షాకింగ్‌ నిర్ణయం..ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌!

Jul 8 2025 5:49 PM | Updated on Jul 8 2025 6:10 PM

Shruti Haasan Take Break From Social Media

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో శ్రుతీహాసన్‌(Shruti Haasan) ఒకరు. సినిమా అప్డేట్స్తో పాటు తన పర్సనల్విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు తరచు ఫోటోషూట్చేసి వాటిని ఇన్స్టాలో షేర్చేస్తూ ఫ్యాన్స్ని అలరిస్తుంది. ఇన్స్టాలో ఆమెకు 24 మిలియన్ల ఫాలోవర్స్ఉన్నారంటే..ఆమె నెట్టింట ఎంత యాక్టివ్గా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా బ్యూటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్ల పాటు సోషల్మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. విషయాన్ని తన ఫాలోవర్స్కి తెలియజేస్తూ ఇన్స్టాలో పోస్ట్పెట్టింది.

కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ఈ అమ్మడు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే. తన అకౌంట్‌‌ను రికవరీ చేసుకున్నట్లు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకోబోతున్నట్లు ప్రకటించడంతో అంతా షాక్ అవుతున్నారు. శ్రుతీహాసన్సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం రజనీకాంత్కూలీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. లోకేశ్కనగరాజ్దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆగస్ట్‌ 14 విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement