నిర్మాతకు 'ఓజీ' దెబ్బ.. వివాదంపై సుజీత్‌ ట్వీట్‌ | Director Sujeeth gratitude post on dvv danayya | Sakshi
Sakshi News home page

నిర్మాతకు 'ఓజీ' దెబ్బ.. వివాదంపై సుజీత్‌ ట్వీట్‌

Oct 21 2025 4:12 PM | Updated on Oct 21 2025 4:56 PM

Director Sujeeth gratitude post on dvv danayya

దర్శకుడు సుజీత్(Sujeeth), నిర్మాత దానయ్య కలిసి తెరకెక్కించిన చిత్రం ఓజీ (OG).. గత నెలలో విడుదలైన మూవీలో పవన్కల్యాణ్హీరోగా నటించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 23 ఓటీటీలోకి కూడా రానుంది. సమయంలో దర్శకుడు సుజీత్ఒక పోస్ట్చేశారు. ఓజీ బడ్జెట్‌ విషయంలో దానయ్యతో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న సమయంలో ఆయన ఇలా క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.

దర్శకుడు సుజీత్‌ చేసిన పోస్ట్లో ఇలా పేర్కొన్నారు . 'ఓజీ మూవీ విషయంలో చాలామంది ఎన్నో విధాలుగా చర్చించుకున్నారు. అయితే, సినిమా మొదలైన సమయం నుంచి పూర్తి అయ్యే వరకు ఏం అవసరమనేది కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు. విషయాలు చాలామందికి తెలియవు. ఓజీ మూవీ విషయంలో నా నిర్మాత ఇచ్చిన మద్ధతు చాలా గొప్పది. మాటల్లో చెప్పలేను.' అని ఆయన అన్నారు.

ఓజీ సినిమా నిర్మాణ కోసం దర్శకుడు సుజీత్చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నారని మొదటి నుంచే వార్తలు వచ్చాయి. మొదట అనుకున్న బడ్జెట్కూడా దాటేసిందని ఇండస్ట్రీలో చెప్పుకొచ్చారు. అలా వారిద్దరి మధ్య గొడవలు స్టార్ట్అయ్యాయని ప్రచారం అయింది. రూ. 300 కోట్లు వచ్చాయని చెప్పుకుంటున్నా సరే మూవీ బడ్జెట్భారీ స్థాయిలో పెరగడంతో నిర్మాతకు నష్టాలు తప్పలేదని చాలామంది ఆరోపించారు. దీంతో ఓజీ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలకు దానయ్య నిర్మాతగా వ్యవహరించడం లేదనే టాక్వైరల్అయింది.

ఓజీ టైమ్లోనే హీరో నానితో సుజీత్ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. మూవీని కూడా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపైనే రూపొందిస్తున్నట్టు సమయంలో తెలిపారు. అయితే, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ప్రాజెక్ట్లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో, దానయ్య- సుజీత్‌ల మధ్య వచ్చిన రూమర్స్కు మరింత బలాన్ని ఇచ్చాయి. అయితే, తాజాగా సుజీత్చేసిన పోస్ట్తో గొడవలకు ఫుల్స్టాప్పడినట్లు అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement