Acharya: ఇక స్టెప్పులేయనున్న చిరు, చెర్రీ

Chiranjeevi, Ram Charan Dance Together In Acharya - Sakshi

Acharya: తండ్రీకొడుకు (చిరంజీవి- రామ్‌చరణ్‌) ఇక స్టెప్పులు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఆచార్య చిత్రం రెండు పాటలు మినహా పూర్తైంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌, రామ్‌చరణ్‌ సరసన పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్‌ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. 'అనుకున్న ప్రకారం టాకీ పార్ట్‌ను జూలై 31కి పూర్తి చేశాం. రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. ఆగస్టు 20 నుంచి చిరంజీవి, చరణ్‌లపై ఓ పాట, అలాగే చరణ్‌- పూజా హెగ్డేలపై మరో పాటను చిత్రీకరిస్తాం. దీంతో షూటింగ్‌ పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా జరగుతున్నాయి' అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌. తిరువణ్ణాపుక్కరసు, సంగీతం: మణిశర్మ. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వైవీ ప్రవీణ్‌ కుమార్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top