
యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్పై గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ నటీనటులుగా యం.యన్. వి సాగర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "బ్యాచిలర్స్ ప్రేమ కథలు". ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ దర్శకులు వీర శంకర్ క్లాప్ ఇచ్చారు. ఆపై మీడియా సమావేశం నిర్వహించారు.
చిత్ర దర్శక, నిర్మాత, సాగర్ మాట్లాడుతూ.. 'ఇంతకుముందు నేను తీసిన "కాలం రాసిన కథలు" సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఆ ఉత్సాహంతో దానికి సీక్వెల్గా 'బ్యాచిలర్స్ ప్రేమ కథలు' సినిమా తీస్తున్నాను. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి షోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాను. అలాగే ఇందులో కూడా నూతన నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను.ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి ఇదే ఏడాదిలోనే విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.' అని అన్నారు.