టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా తదితరులు నటించిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకత్వంలో దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 9న రిలీజ్ కానుంది. ఎలక్ట్రానిక్ కిలి, ఆర్కాడో సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘వేవేల ఊహలే చూపినా..’ అంటూ సాగే సెకండ్ సాంగ్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా, శ్రీ సాగర్ పాడారు. వేణు దోనేపూడి మాట్లాడుతూ– ‘‘వేవేల ఊహలే చూపినా..’ అనే సాంగ్ డిఫరెంట్ స్టైల్లో సాగుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి’’ అన్నారు.


