జోష్‌ మీదున్న హీరో ఆది..మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌

Aadi Sai Kumar To Act His Next Film With Director Bhaskar Bantupalli - Sakshi

హీరో ఆది సాయికుమార్‌, ఇటీవలె నటించిన సినిమా ‘శశి’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినమా ఇటీవలె విడుదలయ్యింది. ఇప్పుడు ఆది మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భాస్కర్ బంటు పల్లి దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశాడు. ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఆది సరికొత్త క్యారక్టరైజేషన్తో , స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.  శిఖర  క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పిస్తుండగా  గుడివాడ యుగంధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


సాకేత్  కొమండూరి ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా A. D.మార్గల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  ఇక దర్శకత్వంతో పాటు కథ స్క్రీన్ ప్లే మాటలను  భాస్కర్ బంటు పల్లి  అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 13న ఉగాది సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

చదవండి : ‘శశి’ టీంకు భారీ షాక్‌.. విడులైన తొలి రోజే..
అర్థరాత్రి షూటింగ్‌లో గాయపడ్డ నటి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top