ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు

Sep 13 2025 7:47 AM | Updated on Sep 13 2025 7:47 AM

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు

తూప్రాన్‌: పట్టణంలో మైనార్టీ సోదరులు మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి పట్టణంలో మున్సిపల్‌ కార్యాలయం వరకు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. మైనార్టీలు ప్రతి ఏటా ఈ పండుగను సంతోషంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని, ఈ పండుగ విశిష్టతను మత పెద్దలు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ శివానందం బందోబస్తు చేపట్టారు.

ముస్లింల ర్యాలీ

మనోహరాబాద్‌(తూప్రాన్‌): మిలాద్‌–ఉన్‌–నబీ వేడుకలలో భాగంగా మనోహరాబాద్‌, కాళ్లకల్‌ ముప్పిరెడ్డిపల్లి, పర్కిబండ, లింగారెడ్డిపేట్‌లో ముస్లింలు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు మజీద్‌లలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మనోహరాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ అధ్యక్షుడు జావీద్‌పాషా, కమిటీ అధ్యక్షుడు అజీజ్‌ఖాన్‌, సభ్యులు సమద్‌, నయిమ్‌, రజాక్‌, రఫీక్‌, షర్ఫుద్దీన్‌, మహ్మద్‌బేగ్‌, సంయుద్దీన్‌, గౌస్‌, ఫహీం, ఉస్మాన్‌, గులాం, జిలానీ, మోయిజ్‌, అప్సర్‌, ఇర్షాద్‌, అజ్జు, లాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement