24 గంటల సూర్యనమస్కారాల ప్రదర్శన
మందమర్రిరూరల్: పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో గల స్టేజీపై స్థానికు డు మద్ది శంకర్, రామకృష్ణాపూర్కు చెందిన ముషిని వెంకటేశ్ (హోంగార్డు) శ శనివారం ఉదయం 24 గంటల పాటు సూర్యనమస్కారాల ప్రదర్శన చేపట్టారు. రథసప్తమి సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటల వరకు ఉంటుందని యోగా మాస్టర్ ముల్కల్ల శంకర్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 18న మద్ది శంకర్ ఒక్క గంటలో 180 సెట్లు సూర్క నమస్కారాలు ప్రదర్శించి అంతర్జాతీయ యోగా బుక్లో స్థానం సంపాదించాడు. ముషిని వెంకటేశ్ 2023 జూన్2 365 (ప్రతీరోజు 180 సె ట్ల సూర్య నమస్కారాలు) నాన్స్టాప్ సూర్యనమస్కారాల ప్రదర్శనతో అంతర్జాతీయ యో గా బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు. వీరిని మా స్టర్, సభ్యులు, స్థానికులు అభినందించారు.


