మందమర్రి ఏరియా ఉద్యోగులు వీరే..
మందమర్రిరూరల్: రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ అధికారిగా కాసిపేట–1 గని డిప్యూటీ మేనేజర్ ఎం.వెంకటేశ్, కేకే–ఓసీ ఓవర్మెన్ బత్తుల సత్యనారాయణ ఉత్తమ సింగరేణియన్గా ఎంపికయ్యారు. కొత్తగూడెంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం కృష్ణభాస్కర్ చేతుల మీదుగా సన్మానం అందుకోనున్నారు. సీహెచ్.నర్సయ్య (కోల్ కట్టర్, శాంతిఖని), మాటూరి రాజనర్సు (సీనియర్ మైనింగ్ సర్దార్, శాంతిఖని, నాడెం సతీశ్కుమార్ (ఎలక్ట్రీషియన్, కాసిపేట–2), మేకల కుమారస్వామి (కోల్ కట్టర్, కాసిపేట–2), లంక లక్ష్మణ్ (కోల్ కట్టర్, కాసిపేట–1), గొలుసుల వెంకటేశ్ (జనరల్ అసిస్టెంట్, కాసిపేట–1), బడుగు సంపత్రావు (ఫిట్టర్, కేకే–5), బత్తిని రామన్న (ట్రామర్, కేకే–5), కుర్రె రమేశ్ (ఈపీ ఆపరేటర్, కేకే–ఓసీపీ), దుర్గం రమేశ్ (కన్వేయర్ ఆపరేటర్, కేకే–ఓసీపీ) ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికయ్యారు. ఏరియాలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో జీఎం రాధాకృష్ణ వారిని సన్మానించనున్నారు.
మందమర్రి ఏరియా ఉద్యోగులు వీరే..
మందమర్రి ఏరియా ఉద్యోగులు వీరే..


