బస్సులు లేక..
భీమారం: మండలంలోని కొత్తపల్లి, మద్దికల్, ఆరెపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సు నడవని కారణంగా విద్యార్థులు ఆటోల్లో భీమారంలోని పాఠశాలలకు వెళ్తున్నారు. మద్దికల్ నుంచి ఒక్కో విద్యార్థి రూ.30, ఆరెపల్లి నుంచి రూ.20 చొప్పున చెల్లిస్తుంటారు. కొందరు తల్లిదండ్రులు నెలవారీగా మాట్లాడి పిల్లలను ఆటోల్లో పంపిస్తున్నారు. భీమారం నుంచి కొత్తపల్లి వరకు బీటీ రోడ్డు ఉన్నా ఆర్టీసీ బస్సు నడిపించడం లేదు. దీంతో ప్రయాణికులు, విద్యార్థులు ఆటోలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆర్టీసీ అధికారులు భీమారం నుంచి ఆరెపల్లి మీదుగా కొత్తపల్లి వరకు బస్సులు నడిపించా లని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


