
ప్రయత్నం ఫలించింది..
జిల్లావాసుల ఆకాంక్షలకు అనుగుణంగా ఎ యిర్పోర్టు అవశ్యకత ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జ రిగింది. పార్లమెంట్లో రెండుసార్లు ప్రస్తావించాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను స్వయంగా కలిసి విన్నవించాను. వారు స్పందించి అవసరమైన మాస్టర్ప్లాన్ సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవడంతో నా ప్రయత్నం ఫలించినట్లవుతుంది. త్వరలోనే పనులు వేగవంతమయ్యే అవకాశముంది.
– గొడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ
‘సాక్షి’ చొరవ అభినందనీయం
జిల్లా ప్రజల ఆకాంక్షలను పాలకుల దృష్టి కి తీసుకెళ్లేలా ‘సాక్షి’ దినపత్రిక మార్చి 5న అన్ని వర్గాలతో చర్చా వేదిక ఏర్పాటు చేసింది. ఆయా వర్గాల వారు అభిప్రాయాలు వెల్ల డించారు. ఎయిర్పోర్ట్ సాధనకు ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. వారు అసెంబ్లీ, పార్లమెంట్లో ప్రస్తావించారు.
– సోగాల సుదర్శన్, ఎయిర్పోర్టు సాధన అడహక్ కమిటీ సభ్యుడు

ప్రయత్నం ఫలించింది..

ప్రయత్నం ఫలించింది..