మద్యం దుకాణాలకు 655 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాలకు 655 దరఖాస్తులు

Oct 18 2025 7:23 AM | Updated on Oct 18 2025 7:23 AM

మద్యం దుకాణాలకు 655 దరఖాస్తులు

మద్యం దుకాణాలకు 655 దరఖాస్తులు

● నేటితో ముగియనున్న టెండర్‌ గడువు ● సిండికేటుగా ఏర్పడి దక్కించుకునే ప్రయత్నాలు

మంచిర్యాలక్రైం: కొత్త మద్యం పాలసీ నిర్వహణకు టెండర్ల గడువు శనివారం నాటితో ముగియనుంది. జిల్లాలో 73 దుకాణాలకు గాను శుక్రవారం వరకు 655 దరఖాస్తులు వచ్చాయి. అంచనాకు మించి దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావించిన అధికారులకు నిరాశే ఎదురైంది. నేడు ఒక్క రోజే దరఖాస్తుల సంఖ్య రెండు వేలకు పైగా దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో 73 మద్యం దుకాణాలకు 2,242 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి దరఖాస్తు రుసుం పెంచడంతో మద్యం వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి దుకాణాలు దక్కించుకునేందుకు వ్యూహం పన్నుతున్నారు. ఎకై ్సజ్‌ శాఖ అధికారులు మాత్రం టెండర్లు అధికంగా వచ్చే విధంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

జిల్లాలో..

స్టేషన్‌ దుకాణాలు దరఖాస్తులు

మంచిర్యాల 26 263

లక్సెటిపేట 12 109

బెల్లంపల్లి 25 185

చెన్నూర్‌ 10 98

మొత్తం 73 655

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement