
బాసర క్షేత్రంలో భక్తుల రద్దీ
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనా నికి భక్తులు పోటెత్తారు. శనివారం సంకటచతుర్థి శు భ ముహూర్తం కావడంతో ఆలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మ హారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని ద ర్శించుకున్నారు. చిన్నారులతో అక్షరాభ్యాస మండపంలో అర్చకులతో అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు జరిపించారు. వివిధ అర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.9,14,500 ఆదాయం వచ్చినట్లు ఆల య కార్యనిర్వహణాధికారి సుధాకర్రెడ్డి తెలిపారు.
గంజాయి పట్టివేత
నస్పూర్: పట్టణ పరిధిలో గంజాయి కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం స్థానిక ఎస్సై ఉపేందర్రావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి సీతారాంపల్లిరోడ్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో విద్యానగర్కు చెందిన నాధరి వంశీ వద్ద 99 గ్రాముల గంజాయి లభ్యమైంది. గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
చౌడేశ్వరీ మాత ఆలయంలో చోరీ
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణ శివారులోని చౌడేశ్వరీ మాత ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం గేట్లకు వేసిన తా ళాలను పగులగొట్టి లోనికి చొరబడ్డ దొంగలు బీరువాలోని వస్తువులను చిందరవందర చేశారు. ఆల య సిబ్బంది శనివారం ఉదయం ఆలయానికి వ చ్చి చూడగా తాళం పగులగొట్టి సామగ్రి చిందరవందరగా ఉండగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీ సులకు సమాచారమందించారు. దీంతో టూ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పరిసరాలను తనిఖీ చేసి ఆధారాలు సేకరించారు. కాగా, ఓ ముక్కు పుడక కనిపించడం లేదని ఆలయ పూజారి తెలిపారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బావిలో పడి చుక్కల దుప్పి మృతి
దస్తురాబాద్: దాహార్తి తీర్చుకునేందుకు వచ్చిన చుక్కల దుప్పిని ఊరకుక్కలు తరమడంతో వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. ఎఫ్ఎస్వో కింగ్ఫిషర్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆకోండపేట గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలో గ్రాస్ ప్లాంటేషన్లో భాగంగా గడ్డి పెంచుతున్నారు. సమీపంలో చెరువు ఉండటంతో గ్రాస్ ప్లాంటేషన్ ప్రాంతానికి తరచూ వన్యప్రాణులు మే త, నీటి కోసం వస్తుంటాయి. ఈ క్రమంలో శనివా రం ఇక్కడికి వచ్చిన చుక్కల దుప్పులను ఊర కుక్కలు తరిమాయి. ఈ క్రమంలో ఓ చుక్కల దుప్పి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో పడింది. స్థానికులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు తాళ్ల సాయంతో దానిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన చుక్కల దుప్పికి పశువైద్యాధికారులు చికిత్స అందించినా మృతి చెందింది. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి అటవీ ప్రాంతంలో దానిని ఖననం చేశారు.

బాసర క్షేత్రంలో భక్తుల రద్దీ