
అభివృద్ధిపై మంత్రి దృష్టి సారించాలి
చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి దృష్టి సారించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. చెన్నూర్ బీజేపీ కార్యాలయంలో గురువా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. చెన్నూర్ మున్సిపాలిటీ పక్కనే గోదావరి నది ఉన్నా తాగునీటి కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారని తె లిపారు. ఇసుక తీసుకొస్తే అడ్డుకుంటున్నారని, ఇళ్ల నిర్మాణాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. శ్మ శాన వాటిక లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నో చుకోలేదని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని, వర్షాకాలం దృష్ట్యా నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యు డు సమ్మయ్య, పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కొండపాక చారి, మాజీ కోఆప్షన్ సభ్యుడు కేవీఏం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు పాల్గొన్నారు.