
తాటిచెట్లపై పిడుగులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం ధర్మారం గ్రామ శివారులో గురువారం రెండు తాటిచెట్లపై పిడుగులు పడ్డాయి. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి రెండు చెట్లపై పిడుగులు పడడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
పిడుగుపడి ఆలయ గోపురం ధ్వంసం
తాంసి: గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూ డిన భారీ వర్షానికి బండల్నాగా పూర్లో రా మాలయం గోపురంపై పిడుగుపడింది. ఒక్కసారిగా ఆల య గోపురంపై పిడుగుపడడంతో కలశంతో పాటు గోపురం ధ్వంసమైంది. పిడుగు పడిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పిడుగు పా టు ప్రభావంతో గ్రామంలోని పలువురి ఇళ్లలో గృహోపకరణాలు సైతం కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.
మహిళను బెదిరించిన ఒకరిపై కేసు
మంచిర్యాలక్రైం: మహిళను బెదిరించిన ఒకరిపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీకి చెందిన దేశవేని సునీత, జన్నారం మండలంలోని ధర్మారంకు చెందిన దుర్గం లింగేశ్వర్ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నారు. సదరు మహిళ లింగేశ్వర్కు రూ.50 వేల నగ దు, 13 గ్రాముల బంగారం ఇచ్చింది. చెల్లించమనడంతో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకొమ్మని బెదిరించాడు. సునీత ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

తాటిచెట్లపై పిడుగులు