విద్యుదాఘాతంతో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

Jun 10 2025 3:28 AM | Updated on Jun 10 2025 3:28 AM

విద్య

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

భైంసాటౌన్‌: పట్టణంలోని గీతా కాటన్‌ ఇండస్ట్రీస్‌లో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న చంద్రకాంత్‌ దేశ్‌ముఖ్‌ అనే వ్యక్తి సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. కుభీర్‌ మండలం వర్నికి చెందిన చంద్రకాంత్‌ కొన్నేళ్లుగా రాహుల్‌నగర్‌లో ఉంటూ, గీతా కాటన్‌ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఫ్యాక్టరీలో ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయమై పట్టణ సీఐ జి.గోపినాథ్‌ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

గంజాయి దహనం

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదైన 14 కేసుల్లో పట్టుబడ్డ 77 కిలోల 781 గ్రాముల గంజాయిని దహనం చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి వద్ద గల శ్రీ మెడికేర్‌ సర్వీసెస్‌ సెంటర్‌ వద్ద గంజాయి డిస్పోజల్‌ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు డీసీఆర్బీ డీఎస్పీ సీహెచ్‌ నాగేందర్‌, డీసీఆర్బీ ఎస్సై హకీమ్‌లు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులో అధికారుల నిలదీత

దండేపల్లి: మండలంలోని తాళ్లపేటలో సోమవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అధికారులను గ్రామానికి చెందిన కొందరు సమస్యలపై నిలదీశారు. గ్రామానికి చెందిన ఎండీ రశీద్‌ఖాన్‌ డీఎస్‌ పెండింగ్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే రిజెక్ట్‌ చేయడంతో సమస్య పరిష్కారం కాలేదని, సదస్సుకు హాజరైన డీటీ మాధవి, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు లావణ్య, ప్రవీణ్‌లను ప్రశ్నించారు. అధికారులు కొందరికి అనుకూలంగా, మరికొందరికి ప్రతికూలంగా పనులు చేస్తున్నారని ఆరోపించారు. రశీద్‌ఖాన్‌తో పాటు నర్సయ్య అనే మరో రైతు సైతం అధికారులను తన సమస్యపై ప్రశ్నించాడు. మండలంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తాళ్లపేటలోనే భూ సమస్యలపై 57, సాదాబైనామాలకు సంబంధించి 79 దరఖాస్తులు వచ్చాయి.

విద్యుదాఘాతంతో ఒకరి మృతి1
1/1

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement