
ఎందుకు అనర్హులం?
నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు స్కూళ్లకు వెళ్తున్నారు. మా పాప హహీరా ఉర్దూ స్కూళ్లో 3వ తరగతి చదువుతోంది. బాబు షారిక్ ప్రైవేటు స్కూలులో 4వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరికీ తల్లికి వందనం పథకంతో రూ.30వేలు వస్తాయనుకున్నాం. గతంలో మా పాపకు అమ్మ ఒడి వచ్చింది. ఇప్పుడు ఒక్కరికీ కూడా రాలేదు. అనర్హుల జాబితాలో పేరున్నట్లు చెబుతున్నారు. మేం ఎందుకు అనర్హులమో అర్థం కావడం లేదు. చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం ఇవ్వాల్సిందే.
– షాహిరూన్, పాములపాడు